అటు అభినందన్ అప్పగింత.. ఇటు సరిహద్దులో పాక్ కాల్పుల మోత

  • మళ్లీ కాల్పులకు తెగబడిన పాక్
  • నలుగురు జవానుల మృతి
  • దీటుగా ప్రతిస్పందిస్తున్న భారత్
శాంతిని కాంక్షిస్తున్నామంటూ చెబుతున్న పాకిస్థాన్.. మళ్లీ కాల్పులకు తెగబడింది. పాకిస్థాన్ చెరలో ఉన్న భారత వింగ్ కమాండర్ అభినందన్‌ను అప్పగిస్తూనే.. మరోవైపు పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. ఎల్‌ఓసీ సమీపంలోని పూంఛ్ సెక్టార్‌లో మేండర్, కృష్ణా ఘాట్, బాలా కోట్, మోర్టార్‌లలో పాక్ సైన్యం కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లతో పాటు ఇద్దరు పోలీసులు కూడా మృతి చెందినట్టు సమాచారం. పాక్ జరుపుతున్న కాల్పులకు భారత్ కూడా అంతే దీటుగా ప్రతిస్పందిస్తోంది.
Go Back to Shorts
Pakistan
India
Abhinandan
Soldiers
Balakot
Mortor
Krishna Ghat

More Telugu News